కో ఆప్టెక్స్లో రూ.10 కోట్ల విక్రయాల లక్ష్యం
ABN , First Publish Date - 2021-10-23T12:25:10+05:30 IST
దీపావళి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేనేత దుస్తులపై 30 శాతం ప్రత్యేక రాయితీ ఇస్తోంది. ఈ విక్రయాలను శుక్రవారం రాణీపేట కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో చేనేత, జౌళి శాఖ మంత్రి
- మంత్రి గాంధీ
వేలూరు(Chennai): దీపావళి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేనేత దుస్తులపై 30 శాతం ప్రత్యేక రాయితీ ఇస్తోంది. ఈ విక్రయాలను శుక్రవారం రాణీపేట కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో చేనేత, జౌళి శాఖ మంత్రి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... అన్ని జిల్లాల్లో కో ఆప్టెక్స్ విక్రయాలు ప్రారంభమయ్యాయయని తెలిపారు. గత రెండు నెలల్లో కోటి రూపాయలకు పైగా విక్రయాలు జరిగాయని, రోజుకు రూ.10 కోట్లు విక్రయాలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భాస్కర్ పాండ్యన్ తదితరులు పాల్గొన్నారు.