నేటి అర్ధరాత్రి నుంచి ముంబైలో తగ్గనున్న సీఎన్జీ, పీఎన్జీ ధరలు
ABN , First Publish Date - 2020-04-04T22:28:09+05:30 IST
నేటి అర్ధరాత్రి నుంచి ముంబై ప్రాంతంలో కంప్రెస్డ్ (సీఎన్జీ), డొమెస్టిక్ పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) ధరలు
ముంబై: నేటి అర్ధరాత్రి నుంచి ముంబై ప్రాంతంలో కంప్రెస్డ్ (సీఎన్జీ), డొమెస్టిక్ పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) ధరలు తగ్గనున్నాయి. ఈ మేరకు మహానగర్ గ్యాస్ లిమిటెడ్ (ఎంజీఎల్) నిర్ణయించింది. సీఎన్జీ ధర కేజీకి రెండు రూపాయలు తగ్గనుండగా, పీఎన్జీ గ్యాస్ ధర కేజీకి రూపాయి తగ్గనుంది. దేశీయంగా ఉత్పత్తి అవుతున్న సహజ వాయువు ధరలను ప్రభుత్వం తగ్గించిన నేపథ్యంలో ఎంజీఎల్ ఈ నిర్ణయం తీసుకుంది. ధరల తగ్గింపుతో సీఎన్జీ ధర కిలోరూ.47.95 కానుంది. ఫలితంగా శ్లాబ్ 1లో కిలో సీఎన్జీ ధర రూ. 29.60కు తగ్గనుండగా, శ్లాబ్ 2లో పీఎన్జీ ధర కిలోకు రూ.35.20గా ఉండనుంది.