సీఎం సహాయనిధి ఎల్వోసీ అందజేత
ABN , First Publish Date - 2022-08-10T05:16:16+05:30 IST
మంత్రి సబితారెడ్డి సీఎం సహాయనిధి నుంచి రూ.2 లక్షలు మంజూరు చేయించారు.
సరూర్నగర్, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): మీర్పేట్ కార్పొరేషన్ 42వ డివిజన్కు చెందిన సీహెచ్ బాబు భార్య మంజుల ఇటీవల అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరగా వైద్యం కోసం అధిక మొత్తంలో ఖర్చయింది. పేద కుటుంబానికి చెందిన బాబు తన ఆర్థిక పరిస్థితిని కార్పొరేటర్ సిద్దాల పద్మాఅంజయ్య, టీఆర్ఎస్ అధికార ప్రతినిధి బండి నాగేశ్యాదవ్ దృష్టికి తీసుకెళ్లగా.. వారు బాధితుడిని మంత్రి సబితారెడ్డి వద్దకు తీసుకెళ్లారు. వెంటనే ఆమె సీఎం సహాయనిధి నుంచి రూ.2 లక్షలు మంజూరు చేయించారు. దీనికి సంబంధించిన ఎల్వోసీని మంగళవారం బాబుకు అందజేయగా, మంత్రితో పాటు స్థానిక నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.