సీఎంఆర్ఎఫ్కు రూ.50 వేల విరాళం
ABN , First Publish Date - 2020-03-28T06:37:06+05:30 IST
కరోనా నియంత్రణకు తమ వంతుగా ఎస్ఏపీ కళాశాల రిటైర్డ్ రీడర్ డాక్టర్ ముత్తారెడ్డి రూ.50 వేల ఆర్థిక సహాయం...
- నగదు అందజేసిన రిటైర్డ్ రీడర్
వికారాబాద్ : కరోనా నియంత్రణకు తమ వంతుగా ఎస్ఏపీ కళాశాల రిటైర్డ్ రీడర్ డాక్టర్ ముత్తారెడ్డి రూ.50 వేల ఆర్థిక సహాయం ప్రకటించారు. శుక్రవారం చెక్కును ఎమ్మెల్యే మెతుకు ఆనంద్కు అందజేశారు. ఈ సందర్భంగా ముత్తారెడ్డిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, ఆర్డీవో ఉపేందర్రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమే్షకుమార్, డిప్యూటీ ఈఈ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.