సీఎంఆర్ఎఫ్.. పేదలకు వరం : మంత్రి
ABN , First Publish Date - 2022-05-18T05:30:00+05:30 IST
సీఎంఆర్ఎఫ్.. పేదలకు వరం : మంత్రి
మేడ్చల్, మే 18 : సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకు వరమని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మున్సిపల్ ఎన్జీవోఎస్ కాలనికి చెందిన హరిదాస్ అనురాధ అనారోగ్యంతో చికిత్స పొందుతూ సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకోగా రూ.60 వేలు మంజూ రయ్యాయి. దీంతో చెక్కును బుధవారం మంత్రి తన నివాసంలో బాధితులకు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్చైర్మన్ రమేష్, కౌన్సిలర్లు స్వామియాదవ్, మణికంఠ, నాయకులు మర్రి నర్సింహారెడ్డి, రఘుగౌడ్, సందీ్పగౌడ్ తదితరులు పాల్గొన్నారు.