CM Jagan పర్యటనతో పోలీసుల అతి.. ప్రజలకు అష్టకష్టాలు

ABN , First Publish Date - 2022-04-28T12:35:42+05:30 IST

CM Jagan పర్యటనతో పోలీసుల అతి.. ప్రజలకు అష్టకష్టాలు

CM Jagan పర్యటనతో పోలీసుల అతి.. ప్రజలకు అష్టకష్టాలు

ఎన్టీఆర్ జిల్లా/వన్‌టౌన్‌ : వన్‌టౌన్‌లో ముసాఫిర్‌ ఖానా ప్రారంభించేందుకు సీఎం రావడమేమోగానీ ప్రజలు మాత్రం అష్టకష్టాలపాలయ్యారు. సీఎం రాకకు ముందు, ఆ తరువాత కూడా ఆ మార్గంలో వాహనాలను నిషేధించారు. ప్రధాన రహదారుల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు. కాళేశ్వరరావు మార్కెట్‌ నుంచి పంజా సెంటర్‌ వరకు రోడ్లకు ఇరువైపులా టెంపరరీ రెయిలింగ్‌లను ఏర్పాటు చేశారు.


ఇప్పటికే రోడ్డు మరమ్మతుల కారణంగా కొన్ని రోజుల నుంచి కేటీ రోడ్డులో వన్‌ వేలో బస్సులను అనుమతిస్తున్నారు. సీఎం రాకతో ఆ ఒక్క మార్గంలో కూడా నిలిపివేశారు. దీంతో ఆ ప్రాంతంలో ప్రయాణించేవారంతా తమ గమ్యస్థానాలకు చేరుకునే క్రమంలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇదే అదనుగా ఆటోవాలాలు చార్జీలు పెంచేశారు. సీఎం పర్యటన బందోబస్తు పేరుతో విజయవాడ పోలీసుల అతి జాగ్రత్తలపై ప్రజలు మండిపడ్డారు.

Updated Date - 2022-04-28T12:35:42+05:30 IST