సొంత ఇలాకా పులివెందులలో నేడు CM YS Jagan పర్యటన
ABN , First Publish Date - 2021-10-03T12:52:45+05:30 IST
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు
కడప : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు సొంత ఇలాకా పులివెందులలో ఇవాళ పర్యటించనున్నారు. రెండు రోజుల కడప జిల్లా పర్యటనలో భాగంగా జగన్ శనివారం సాయంత్రం ప్రత్యేక హెలికాప్టర్లో ఇడుపులపాయకు చేరుకున్నారు. రాత్రి ఇడుపులపాయలోనే సీఎం బస చేశారు. ఇవాళ ఇడుపులపాయ నుంచి పులివెందులకు సీఎం వెళ్లనున్నారు. నేడు జగన్ రెడ్డి మామ (భారతి తండ్రి) ఈసీ గంగిరెడ్డి ప్రధమ వర్ధంతి కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి కార్యక్రమంలో పాల్గొననున్నారు. వర్ధంతి కార్యక్రమంలో పలువురు వైసీపీ మంత్రులు, కడప జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు పాల్గొననున్నారు.