ఒక్క చాన్స్ ఇచ్చిన పాపానికి.. జగన్మోసావతారం: లోకేశ్

ABN , First Publish Date - 2020-08-15T21:38:14+05:30 IST

జగన్ సర్కార్ పాలనపై తాను రాసిన వ్యాసాన్ని ట్వీట్ చేస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

ఒక్క చాన్స్ ఇచ్చిన పాపానికి.. జగన్మోసావతారం: లోకేశ్

ఇంటర్నెట్ డెస్క్: జగన్ సర్కార్ పాలనపై తాను రాసిన వ్యాసాన్ని ట్వీట్ చేస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. జగన్మోసావతారం అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు. ‘అడిగావు గదా అని.. ఒక్క ఛాన్సు ఇచ్చిన పాపానికి.. ఒక్క ఓటు వేసిన ఖర్మానికి.. ఈ 15నెలల్లో ఎన్నెన్ని అనుభవాలిచ్చారు..!’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. లోకేశ్ తాను రాసిన వ్యాసంలో.. ‘‘మహాప్రభూ... ఒక్క ఛాన్సు ఇచ్చి ప్రజలు మోసపోయారు. మరొకసారి మోసపోరు. ఒకసారి చేతులు కాలాయి, ఈసారి జాగ్రత్తపడతారు. మీ మోసాలు ఇక సాగవు. ప్రజలు మీ మోసాలను ఎండగట్టగడానికి, నిలదీయడానికి నడుం బిగిస్తున్నారు’’ అంటూ జగన్ సర్కార్‌ను హెచ్చరించారు. 


జగన్మోసావతారం...



Updated Date - 2020-08-15T21:38:14+05:30 IST