రేపు ఢిల్లీకి CM YS Jagan.. కేంద్ర పెద్దలతో కీలక భేటీ

ABN , First Publish Date - 2022-01-02T17:03:35+05:30 IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు (సోమవారం నాడు) ఢిల్లీ వెళ్లనున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయిట్‎మెంట్

రేపు ఢిల్లీకి CM YS Jagan.. కేంద్ర పెద్దలతో కీలక భేటీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు (సోమవారం నాడు) ఢిల్లీ వెళ్లనున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయిట్‎మెంట్ తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ పర్యటనలో భాగంగా తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలు, ప్రాజెక్టుల వ్యవహారంతో పాటు ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై కేంద్ర పెద్దలతో జగన్ చర్చింనున్నట్లు సమాచారం. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంశాల కోసం మూడేళ్లుగా ఏపీ ప్రభుత్వం కోరుతున్నా కేంద్రం నుంచి ఎటువంటి సానుకూలత రాలేదు. దీంతో ఈ పర్యటనలో జగన్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా మూడు రాజధానుల అంశం, అమరావతి భవిష్యత్ గురించి కేంద్రంలోని ముఖ్యులతో ముఖ్యమంత్రి చర్చింనున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2022-01-02T17:03:35+05:30 IST