ఆ ఏడు ప్రాంతాల్లో మద్యమాంసాలు నిషేధం... సీఎం సంచలన నిర్ణయం

ABN , First Publish Date - 2021-08-31T13:18:49+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని మధురలోగల బృందావనం, గోవర్థన్...

ఆ ఏడు ప్రాంతాల్లో మద్యమాంసాలు నిషేధం... సీఎం సంచలన నిర్ణయం

మధుర: ఉత్తరప్రదేశ్‌లోని మధురలోగల బృందావనం, గోవర్థన్, నందగావ్, బర్సానా, గోకుల్, మహావన్‌, బల్‌దేవ్ తదితర ప్రాంతాల్లో త్వరలోనే మద్యమాంసాల విక్రయాలను నిలిపి వేయాలని, ఈ వ్యాపారాలపై ఆధారపడినవారికి ప్రత్యామ్నాయ మార్గం చూపిస్తామని సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా మధురకు వచ్చిన సీఎం అక్కడి రామ్ లీలా మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. 


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2017లో మధుర పరిధిలోని ఏడు ప్రాంతాలను పవిత్ర తీర్థ స్థలాలుగా గుర్తించారని, ఆ ప్రాంతాల్లో మద్యమాంసాలను నిషేధించాలని స్థానికులు ఎప్పటి నుంచో కోరుతున్నారని అన్నారు. ఇప్పుడు దీనిని అమలులోకి తీసుకువస్తున్నామన్నారు. అయితే దీనికి ముందు ఈ వ్యాపారాలపై ఆధారపడినవారికి కౌన్సెలింగ్ ఇచ్చి, వారికి ప్రత్యామ్నాయ వ్యాపారమార్గాలు చూపిస్తామన్నారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక హిందూ పండుగలు ఘనంగా జరుగుతున్నాయన్నారు. 

Updated Date - 2021-08-31T13:18:49+05:30 IST