కర్ణాటక ముఖ్యమంత్రి యెడియూరప్ప సంచలన నిర్ణయం

ABN , First Publish Date - 2020-04-01T16:55:14+05:30 IST

కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప బుధవారం సంచలన నిర్ణయం తీసుకున్నారు.....

కర్ణాటక ముఖ్యమంత్రి యెడియూరప్ప సంచలన నిర్ణయం

సీఎం ఏడాది జీతం కరోనా రిలీఫ్ ఫండుకు విరాళం

బెంగళూరు : కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప బుధవారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొవిడ్-19 ముఖ్యమంత్రి సహాయనిధికి తన ఏడాది జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు సీఎం యెడియూరప్ప బుధవారం ట్వీట్ చేశారు.


‘‘కరోనా వైరస్ ప్రబలుతున్నవేళ మనమందరం ఎదుర్కొంటున్న కష్టమైన సమయం. మనమంతా కలిసి ఈ అంటువ్యాధితో పోరాడటం ముఖ్యం. వ్యక్తిగతంగా, నేను నా ఒక సంవత్సర జీతాన్ని సీఎంఆర్ఎఫ్ కోవిడ్ 19 కి విరాళంగా ఇస్తున్నాను. కరోనా కట్టడి కోసం సహాయం చేయమని నేను మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను’’ అని సీఎం ట్వీట్ లో పేర్కొన్నారు.కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు,శాసనసభ్యులు, అధికారులు, ప్రజలు ముందుకువచ్చి వారి వారి స్థాయిని బట్టి కరోనా సీఎం సహాయనిధికి విరాళాలు అందించాలని సీఎం యెడియూరప్ప కోరారు. 

Updated Date - 2020-04-01T16:55:14+05:30 IST