ఎడప్పాడికి మైనర్ శస్త్రచికిత్స
ABN , First Publish Date - 2021-04-20T17:05:33+05:30 IST
ముఖ్య మంత్రి ఎడప్పాడి పళనిస్వామికి స్వల్ప శస్త్ర చికిత్స జరిగింది. హెర్నియా కారణంగా సమస్య లు ఎదుర్కొంటున్న ఆయన.. సోమ
- మూడు రోజుల్లో డిశ్చార్జి
చెన్నై: ముఖ్య మంత్రి ఎడప్పాడి పళనిస్వామికి స్వల్ప శస్త్ర చికిత్స జరిగింది. హెర్నియా కారణంగా సమస్య లు ఎదుర్కొంటున్న ఆయన.. సోమవారం ఉదయం స్థానిక అమింజిగరైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరగా.. అక్కడ వైద్యులు ఆయనకు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. అక్కడ సీఎంకే నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగటివ్ వచ్చింది. ఆ పరీక్షల అనంతరం సీఎంకు మైనర్ ఆపరేషన్ నిర్వహించామని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడ గా ఉందని వైద్యులు ప్రకటించారు. మూడు రోజుల అనంతరం ముఖ్యమంత్రి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కానున్నారు. ఇదిలా వుండగా నేతలు, కార్యకర్తలు సీఎంను పరామర్శించేందుకు రావద్దని పార్టీ వర్గాలు విజ్ఞప్తి చేశాయి.