దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమానికి సీఎం కృషి
ABN , First Publish Date - 2022-01-18T05:44:09+05:30 IST
దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నా రని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు.
- ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
బోయినపల్లి, జనవరి 17: దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నా రని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. సోమవారం బోయినపల్లి మండల కేంద్రంలో దివ్యాం గులు, వయోవృద్ధులకు సహాయక ఉపకరణాల ఎంపిక కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం స్థంభంపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ అధ్వర్యంలో శుద్ధ జల కేంద్రాన్ని ప్రారంభించారు. గ్రామంలో స్వాగత తోర ణాలు, కమ్యూనిటీ భవనం నిర్మాణానికి శిలా ఫలకం ఆవిష్కరించారు. అనంతరం జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా నియా మకమైన పొట్టెపల్లి సుధాకర్కు నియామక పత్రాన్ని అంద జేశారు. కార్యక్రమాల్లో ఎంపీపీ పర్లపల్లి వేణు గోపాల్, వైస్ ఎంపీపీ కొనకటి నాగయ్య, రైతు బంధు సమితి అధ్యక్షుడు కొనకటి లచ్చిరెడ్డి, సర్పంచులు గుంటి లతాశ్రీ శంకర్, అక్కన్నపల్లి జ్యోతికరుణాకర్, ఎంపీటీసీ సంబ బుచ్చమ్మలక్ష్మీరాజం, ఉపేందర్, టీఆర్ ఎస్ మండల అధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.