సీఎం పర్యటనను విజయవంతం చేయాలి
ABN , First Publish Date - 2022-08-10T04:14:20+05:30 IST
బాపట్లలో గురువారం బాపట్లలో జరగనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభకు చీరాల నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హాజరై విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, వైసీపీ చీరాల నియోజకవర్గ ఇన్చార్జి కరణం వెంకటేష్ పిలుపునిచ్చారు.
రేపు బాపట్లలో సభ
నేతలతో ఎమ్మెల్యే బలరాం,
వెంకటేష్ సన్నాహక సమావేశం
చీరాల, ఆగస్టు 9: బాపట్లలో గురువారం బాపట్లలో జరగనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభకు చీరాల నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హాజరై విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, వైసీపీ చీరాల నియోజకవర్గ ఇన్చార్జి కరణం వెంకటేష్ పిలుపునిచ్చారు. స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో మంగళవారం మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరి కూటి అమృతపాణి, మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, గవిని శ్రీనివాసరావు, చిన్ని లీలాధరరావు, సు బ్బారావు తదితరుల తో కలసి సీఎం సభకు సం బంధించి సన్నాహక సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సభ, సీఎం షెడ్యూల్ను వారికి వివరించారు. అందుకు సంబంధించి బాపట్లలోని సభావేదిక వద్దకు తరలివెళ్లేందుకు వాహనాల ఏర్పాటు, పార్కింగ్, క్రమశిక్షణతో నాయకులు, కార్యకర్తలు సభాస్ధలిలోని నిర్ణీత ప్రదేశాలలో ఆశీనులు కావటం, తిరుగు ప్రయాణం, అవకాశం ఉంటే సీఎం దృష్టికి తీసుకెళ్లాల్సిన నియోజక వర్గ అంశాలు తదితరాలపై చర్చించారు. పలువురికి బాధ్యతలు అప్పగించారు.