24న సీఎం పర్యటనను విజయవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-08-20T05:20:52+05:30 IST

చీమకుర్తిలో ఈనెల 24న జరగనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి బహిరంగసభను విజయవంతం చేయాలని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ కోరారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.

24న సీఎం పర్యటనను విజయవంతం చేయాలి
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న వెంకాయమ్మ

జడ్పీ చైర్‌పర్సన్‌ వెంకాయమ్మ 

ఒంగోలు (కలెక్టరేట్‌), ఆగస్టు 19 : చీమకుర్తిలో ఈనెల 24న జరగనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి బహిరంగసభను విజయవంతం చేయాలని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ కోరారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సీఎం ఈనెల 24న చీమకుర్తిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌, మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ బూచేపల్లి సుబ్బారెడ్డిల కాంశ్య విగ్రహాలను ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం చీమకుర్తిలో జరిగే బహిరంగసభలో పాల్గొంటారన్నారు. కార్యక్రమానికి జిల్లాలోని పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనాయకులందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు మాట్లాడుతూ సీఎం పర్యటనకు అన్ని ఏర్పాట్లుపూర్తి చేశామని తెలిపారు. సమావేశంలో చీమకుర్తి ఎంపీపీ యద్దనపూడి శ్రీనివాసరావు, దుంపా చెంచిరెడ్డి, మండవ అప్పారావు, వేమా శ్రీనివాసరావుతోపాటు ఆ పార్టీ నాయకులు ఉన్నారు.


Updated Date - 2022-08-20T05:20:52+05:30 IST