ఒకే జీవో ద్వారా పీఆర్సీ ప్రకటన చేయాలని సీఎంను కోరాం: సూర్యనారాయణ

ABN , First Publish Date - 2022-01-07T01:08:04+05:30 IST

ఒకే జీవో ద్వారా పీఆర్సీ ప్రకటన చేయాలని సీఎంను కోరాం: సూర్యనారాయణ

ఒకే జీవో ద్వారా పీఆర్సీ ప్రకటన చేయాలని సీఎంను కోరాం: సూర్యనారాయణ

అమరావతి: ఉద్యోగ వ్యవస్థ అందరికీ వర్తించేలా.. ఒకే జీవో ద్వారా పీఆర్సీ ప్రకటన చేయాలని సీఎంను కోరామని సూర్యనారాయణ తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆలోచించాలని సీఎం కోరారని ఆయన అన్నారు. ఉద్యోగ సంఘాలు కూడా తగ్గాలని.. ఆర్థికశాఖ కొంతమేర గణాంకాలను పెంచాలని సీఎం సూచించారని సూర్యనారాయణ చెప్పారు. 2-3 రోజుల్లో పీఆర్సీపై అంతిమ నిర్ణయం తీసుకుంటామన్నారని సూర్యనారాయణ తెలిపారు. సంఘాలుగా సైద్ధాంతిక విభేదాలున్నా.. అందరం వారి సమస్యల్ని తెలియచేశామని ఉద్యోగ సంఘం నేత సూర్యనారాయణ అన్నారు.

Updated Date - 2022-01-07T01:08:04+05:30 IST