Cm stalinకు పెరుగుతున్న ప్రజాదరణ
ABN , First Publish Date - 2021-11-26T16:06:19+05:30 IST
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్కు రోజురోజుకూ ప్రజాదరణ పెరుగుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత, తమిళనాడు మైనార్టీ కమిషన్ చైర్మన్ పీటర్ అల్ఫోన్స్ పేర్కొన్నారు. స్టాలిన్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న
- మైనార్టీ కమిషన్ చైర్మన్ పీటర్ అల్ఫోన్స్
ప్యారీస్(చెన్నై): రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్కు రోజురోజుకూ ప్రజాదరణ పెరుగుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత, తమిళనాడు మైనార్టీ కమిషన్ చైర్మన్ పీటర్ అల్ఫోన్స్ పేర్కొన్నారు. స్టాలిన్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కొళత్తూర్ నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు ప్రభుత్వం, పలు పార్టీలు, స్వచ్ఛంద సేవా సంస్థలు తమ వంతు సాయం అందజేస్తున్నాయి. ఈ క్రమంలో, చెన్నై పశ్చిమ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, ద్రావిడ నాయుడు సమాఖ్య వ్యవస్థాపకుడు తాళ్లూరు సురేష్ సొంత ఖర్చులతో 500 కుటుంబాలకు తలా రూ.700 విలువ గల నిత్యావసర సరుకులను బుధవారం సాయంత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పీటర్ అల్ఫోన్స్ పాల్గొని లబ్ధిదారులకు సాయం అందజేసిన తాళ్లూరు సురే్షను అభినందించారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు జె.ఢిల్లిబాబు, సుమతి అన్బరసు, అశోక్కుమార్, సాయిసతీష్, మురళి, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.