సీఎం కృష్ణపట్నం వెళ్లి సౌకర్యాలు కల్పించాలి
ABN , First Publish Date - 2021-06-20T06:16:10+05:30 IST
ప్రభుత్వా నికి ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ ఉంటే ముఖ్యమం త్రి జగన్మోహన్రెడ్డి స్వయంగా కృష్ణంపట్నం వె ళ్లి ఆనందయ్య మందు కావాల్సిన మౌలిక సదు పాయాలు కల్పించాలని గోవిందానంద సరస్వ తి స్వామీజీ డిమాండ్ చేశారు. శనివారం ఒం గోలు వచ్చిన స్వామిజీ ముందుగా రంగారా యుడుచెరువు వద్ద ఉన్న శివాలయంలో ప్రత్యే క పూజలు నిర్వహించారు.
గోవిందానంద సరస్వతి స్వామిజీ
ఒంగోలు(కలెక్టరేట్), జూన్ 19 : ప్రభుత్వా నికి ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ ఉంటే ముఖ్యమం త్రి జగన్మోహన్రెడ్డి స్వయంగా కృష్ణంపట్నం వె ళ్లి ఆనందయ్య మందు కావాల్సిన మౌలిక సదు పాయాలు కల్పించాలని గోవిందానంద సరస్వ తి స్వామీజీ డిమాండ్ చేశారు. శనివారం ఒం గోలు వచ్చిన స్వామిజీ ముందుగా రంగారా యుడుచెరువు వద్ద ఉన్న శివాలయంలో ప్రత్యే క పూజలు నిర్వహించారు. అనంతరం మంగ మూరురోడ్డులోని పారిశ్రామికవేత్త, శంకరాచా ర్య వేదపాఠశాల వ్యవస్థాపకులు గూడా రా మ్మోహన్ నివాసంలో ఏర్పాటుచేసిన విలేఖరు ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నలుగు రికి ఉపయోగపడాలనే సేవాభావంతో పనిచే స్తున్న ఆనందయ్యకు ప్రతి ఒక్కరు అండగా ని లవాలన్నారు. ప్రజలను కరోనా నుంచి కాపా డేందుకు కృషిచేస్తున్న ఆనందయ్యను ఇంతవర కు వైద్యఆరోగ్యశాఖ మంత్రి నాని కలిసి పరి స్థితులపై చర్చించకపోవడం ఏమిటని ప్రశ్నిం చారు. ఆనందయ్య స్వయంగా తనకు కావాల్సి న సౌకర్యాలపై లేఖ రాసినా ఇంతవరకు ప్ర భుత్వం స్పందించకపోవడం దుర్మార్గంగా ఉంద న్నారు. ఆనందయ్య మందుపై ఇంగ్లీషు డాక్టర్ల కు భయం పట్టుకుందని ఆరోపించారు. ఆనం దయ్య మందును జీర్ణించుకోలేక కొంతమంది డాక్టర్లు ఏవెవో మాట్లాడుతున్నారని, వారు వా స్తవాలు తెలుసుకుంటే మంచిదని సలహా ఇ చ్చారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మొత్తం ఆయుర్వేద వైద్యం చేసే రోజులు వచ్చాయని తె లిపారు. ఆనందయ్య మందు ఆయుర్వేదానికి పునర్జీవం పోసిందన్నారు. అల్లోపతి, సూపర్ స్పెషాలిటీ హస్పిటల్స్ వైద్యం తాత్కాలికమే త ప్ప వ్యాధి మూలాలను నయం చేసిది ఆయు ర్వేద వైద్యమేనని గోవిందానంద సరస్వతి స్వా మి స్పష్టం చేశారు.