సీఎం నోరు జారారు: కన్నా

ABN , First Publish Date - 2020-03-27T08:27:11+05:30 IST

‘‘కరోనావిస్తరణపై నోరు జారిన ముఖ్యమంత్రి... దానిని కప్పిపుచ్చుకునేందుకు వ్యాధి తీవ్రత పట్ల తేలికగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం...

సీఎం నోరు జారారు: కన్నా

గుంటూరు(సంగడిగుంట), మార్చి 26: ‘‘కరోనావిస్తరణపై నోరు జారిన ముఖ్యమంత్రి... దానిని కప్పిపుచ్చుకునేందుకు వ్యాధి తీవ్రత పట్ల తేలికగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర సరిహద్దుల్లో ఏపీ ప్రజలు పడుతున్న బాధలే అందుకు ఉదాహరణ’’ అని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఆయన కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ నుంచి వస్తున్నారన్న సంగతి ముందుగానే తెలుసుకొని ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలం అయిందన్నారు.  కాశీ యాత్రలో చిక్కుకున్న తెలుగు వారిని రప్పించాలన్నారు. లాక్‌డౌన్‌ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పథకాలు పేదలకు ఎంతో మేలు చేస్తాయన్నారు. రాష్ట్ర ప్రజల తరఫున నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తె లుపుతున్నామన్నారు. 


Updated Date - 2020-03-27T08:27:11+05:30 IST