అసెంబ్లీ వేదికగా సీఎం అబద్ధాలు: షర్మిల

ABN , First Publish Date - 2022-03-12T00:11:51+05:30 IST

అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ అబద్ధాలు చెప్తున్నారని వైఎస్సార్‌టీపీ

అసెంబ్లీ వేదికగా సీఎం అబద్ధాలు: షర్మిల

హైదరాబాద్: అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ అబద్ధాలు చెప్తున్నారని వైఎస్సార్‌టీపీ అధినేత షర్మిల అన్నారు. ప్రజాప్రస్థానాన్ని తిరిగి ప్రారంభించిన సందర్భంగా Abnతో షర్మిల ప్రత్యేకంగా మాట్లాడారు. తెలంగాణలో సమస్యలే లేవని చెప్తున్నారని, సీఎంకి దమ్ముంటే తనతో పాటు పాదయాత్రకి రావాలని ఆమె సవాల్ విసిరారు. సమస్యలు లేవని చెప్తే తాను ముక్కు నేలకి రాస్తానని, క్షమాపణలు చెప్పి పాదయాత్ర చేయకుండానే వెళ్ళిపోతానిన ఆమె పేర్కొన్నారు. ప్రజలు సమస్యలు ఉన్నాయని చెప్తే కేసీఆర్ రాజీనామా చేసి దళితుడిని సీఎం చేయాలని కేసీఆర్‌కి ఆమె సవాల్ విసిరారు. ఎంత మందిని కదిలించినా ప్రతి ఒక్కరికీ ప్రభుత్వపరంగా సమస్య ఉందన్నారు. బంగారు తెలంగాణ అని చెప్పి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ముందస్తు ఎన్నికలు ఎంత త్వరగా వస్తే అంత మంచిందని, అపుడు తెలంగాణలో తామే ప్రతిపక్షంగా ఉంటామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. సమస్యలపై తాము పోరాటం చేశాకే కాంగ్రెస్, బీజేపీలె కాపీ చేస్తున్నాయన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్‌లు తమ విజయమేనని Abnతో ఆమె అన్నారు. 


Updated Date - 2022-03-12T00:11:51+05:30 IST