జల వివాదం తర్వాత తొలిసారి.. పెళ్లిలో కలిసిన KCR, Jagan

ABN , First Publish Date - 2021-11-21T20:14:24+05:30 IST

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మళ్లీ కలిశారు. జల వివాదాల తర్వాత సీఎంలిద్దరూ ఒకే వేదికపై కనిపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ పక్కపక్కనే కూర్చుని చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు.

జల వివాదం తర్వాత తొలిసారి.. పెళ్లిలో కలిసిన KCR, Jagan

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మళ్లీ కలిశారు. జల వివాదాల తర్వాత సీఎంలిద్దరూ ఒకే వేదికపై కనిపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ పక్కపక్కనే కూర్చుని చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనవరాలు స్నిగ్ధారెడ్డి పెళ్లి వేడుక ఇందుకు వేదిక అయింది. శంషాబాద్ కొత్తగూడలోని వీఎన్ఆర్ ఫామ్స్‌లో ఆదివారం అంగరంగ వైభవంగా స్నిగ్ధారెడ్డి వివాహం జరిగింది. ఏపీ సీఎం జగన్ వద్ద ప్రత్యేకాధికారిగా పని చేస్తున్న కృష్ణమోహన్ రెడ్డి కుమారుడైన రోహిత్ రెడ్డితో స్నిగ్ధారెడ్డి మూడు ముళ్లు వేయించుకున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ నుంచి సీఎం జగన్‌తో పాటు స్పీకర్ తమ్మినేని, డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి తదితరులు హాజరు అయ్యారు. ఇక హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు పలువురు ప్రముఖులు ఈ వివాహ వేడుకలో పాల్గొన్నారు. వైఎస్ విజయలక్ష్మి కూడా ఈ వేడుకకు హాజరు కావడం విశేషం.











Updated Date - 2021-11-21T20:14:24+05:30 IST