యాదాద్రి ప్రధానాలయ పరిసరాలను పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్

ABN , First Publish Date - 2021-03-04T19:08:44+05:30 IST

యాదాద్రిలో సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. యాదాద్రి పునర్నిర్మాణ ప్రధానాలయ పరిసరాలను సీఎం పరిశీలిస్తున్నారు.

యాదాద్రి ప్రధానాలయ పరిసరాలను పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్

యాదాద్రి-భువనగిరి: యాదాద్రిలో సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. యాదాద్రి పునర్నిర్మాణ ప్రధానాలయ పరిసరాలను  సీఎం పరిశీలిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ప్రత్యేకంగా తయారు చేయించిన క్యూ లైన్లులను పరిశీలించారు. బంగారు వర్ణంలో తయారు చేయబడిన క్యూలైన్ గ్రిల్స్‌పై శంకుచక్రాలు, గోవిందా నామాలు, ముఖ మండపం, ఐరావతం బొమ్మలు, అల్లికలను ప్రత్యేకంగా పరిశీలించిన సీఎం కేసీఆర్ క్యూలైన్లపై పలు సూచనలు చేశారు. 

Updated Date - 2021-03-04T19:08:44+05:30 IST