4న రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన
ABN , First Publish Date - 2021-07-02T00:02:20+05:30 IST
సీఎం కేసీఆర్ ఈ నెల 4న రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు.
రాజన్న సిరిసిల్ల: సీఎం కేసీఆర్ ఈ నెల 4న రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పేదలకు కేసీఆర్ పంపిణీ చేయనున్నారు. అలాగే సిరిసిల్ల నూతన కలెక్టరేట్, నర్సింగ్ కళాశాలను కేసీఆర్ ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.