మాటలతో మభ్యపెడుతున్న కేసీఆర్ : టీడీపీ
ABN , First Publish Date - 2021-01-16T04:07:16+05:30 IST
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రజలను మాటలతో మభ్యపెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కె.దయా కర్రెడ్డి అన్నారు.
మక్తల్, జనవరి 15 : తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రజలను మాటలతో మభ్యపెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కె.దయా కర్రెడ్డి అన్నారు. శుక్రవారం మక్తల్ పట్టణంలోని ఆర్అండ్బీ అథితి గృహంలో మక్తల్, మాగ నూరు, క్రిష్ణ మండలాల కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు.ఈనెల 18వ తేదీన ఎన్టీఆర్ 25వ వర్దంతిని పురస్కరించుకొని దేవరకద్ర పట్టణంలోని శ్రీనివాస ఫంక్షన్ హాల్లో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామని, ఈ శిబిరానికి నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని ముఖ్య అథితిగా పాల్గొంటారన్నారు.