సాయంత్రం ఢిల్లీకి సీఎం కేసీఆర్
ABN , First Publish Date - 2022-02-28T20:43:42+05:30 IST
రోజు సాయంత్రం సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లనున్నారు. మూడ్రోజుల పాటు ఢిల్లీలో ఆయన పర్యటిస్తారు. మంగళవారం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్తో భేటీ అవుతారు.
హైదరాబాద్: ఈ రోజు సాయంత్రం సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లనున్నారు. మూడ్రోజుల పాటు ఢిల్లీలో ఆయన పర్యటిస్తారు. మంగళవారం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్తో భేటీ అవుతారు. నేషనల్ ఫ్రంట్ కోసం పలు ప్రాంతీయ పార్టీల మద్దతును కేసీఆర్ కూడగట్టనున్నారు. ఇందులోభాగంగానే పలు రాష్ట్రాల సీఎంలతో కేసీఆర్ భేటీ అవుతున్నారు. రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లతో సమావేశం అవుతానని, వివిధ అంశాలపై వారితో చర్చిస్తానని కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ‘బీజేపీ ముక్త్ భారత్’ అంటూ నినదించిన సీఎం కేసీఆర్ జాతీయ స్థాయిలో వేదిక ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ప్రధాని మోదీ వ్యతిరేక కూటమి కట్టే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. బీజేపీ, కాంగ్రేసేతర పార్టీలతో జత కట్టేందుకు దేశాన్ని చుట్టేయాలని అనుకుంటున్నారు. ఇటీవల మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో పాటు ఎన్సీపీ నేత శరత్ పవార్తో భేటీ అయ్యారు.