మంత్రులతో సీఎం కేసీఆర్ అత్యవసర భేటీ
ABN , First Publish Date - 2022-03-19T18:59:53+05:30 IST
మంత్రులతో ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యవసరంగా భేటీ అయ్యారు.
హైదరాబాద్: మంత్రులతో ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యవసరంగా భేటీ అయ్యారు. హుటా హుటిన ఫాంహౌజ్కు చేరుకోవాలంటూ ప్రగతిభవన్ నుంచి మంత్రులకు ఫోన్లు వెళ్లాయి. దీంతో శనివారం ఉదయం పలువురు మంత్రులు ఫాంహౌస్కు చేరుకుని సీఎంతో భేటీ అయ్యారు. చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ, పలువురు అధికారులకు కూడా ఫోన్లు వెళ్లాయి. ఇటీవల ఫాంహౌజ్లో కేసీఆర్ను ప్రశాంత్ కిషోర్ కలిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వ పథకాలు, ప్రజల స్పందనపై పికే టీం సర్వే చేసింది. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో మంత్రులతో సీఎం కేసీఆర్ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.