రూ.25 కోట్లతో అతి పెద్ద అల్ట్రా మోడర్న్ కోల్డ్ స్టోరేజి: కేసీఆర్
ABN , First Publish Date - 2020-07-12T01:41:34+05:30 IST
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని క్లస్టర్లలో రైతు వేదికల నిర్మాణం దసరా నాటికి పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా అన్ని క్లస్టర్లలో రైతు వేదికల నిర్మాణం దసరా నాటికి పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రైతుబంధు సాయం, ఇతర వ్యవసాయ అంశాలపై ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... రాష్ట్రంలో రైతుబంధు సాయం అందని రైతులు ఎవరున్నా వెంటనే గుర్తించి చిట్ట చివరి రైతు వరకు అందరికీ ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం సూచించిన మేరకే రైతులు వందకు వందశాతం నియంత్రిత పద్దతిలో ఈ వానాకాలం పంట సాగు చేస్తుండటం శుభసూచకమన్నారు. ఇది భవిష్యత్తులో సాధించే గొప్ప విజయానికి నాంది అన్నారు. సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉత్పత్తి చేసే విత్తనాలను నిల్వ చేసేందుకు రూ.25 కోట్లతో అతి పెద్ద అల్ట్రా మోడర్న్ కోల్డ్ స్టోరేజి నిర్మించనున్నట్లు తెలిపారు.