గంజాయి సాగు చేస్తే అన్నిసౌకర్యాలు బంద్

ABN , First Publish Date - 2021-10-24T01:44:55+05:30 IST

రాష్ట్రంలో గంజాయి సాగు చేసే రైతులకు రైతుబంధు, రైతుబీమా, కరెంట్

గంజాయి సాగు చేస్తే అన్నిసౌకర్యాలు బంద్

హైదరాబాద్: రాష్ట్రంలో గంజాయి సాగు చేసే రైతులకు రైతుబంధు, రైతుబీమా, కరెంట్ సౌకర్యం నిలిపివేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. అంతేకాకుండా వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. పోడుభూముల సమస్య పరిష్కారం, అటవీ రక్షణ - పునరుజ్జీవం, హరితహారం అంశాలపై కలెక్టర్లు, అటవీ, గిరిజన సంక్షేమం, పోలీస్, పంచాయతీ రాజ్ శాఖల ఉన్నతాధికారులతో శనివారం ప్రగతిభవన్‌లో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు.


ఆర్వోఎఫ్ఆర్ భూముల్లో గంజాయి సాగు చేస్తే ఆర్వోఎఫ్ఆర్ పట్టా రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు, ఇతర చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలన్నారు. గుడుంబా తయారీని పూర్తిస్థాయిలో అరికట్టాలన్నారు. గుడుంబా తయారీదారులకు ఉపాధి, పునరావాసం కల్పించేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సమావేశంలో మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతీ రాథోడ్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-24T01:44:55+05:30 IST