వైద్యారోగ్యశాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష
ABN , First Publish Date - 2021-05-06T23:40:50+05:30 IST
వైద్యారోగ్యశాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్: వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఆయన ప్రగతిభవన్కు వెళ్లారు. ప్రగతి భవన్లోనే ఈ సమీక్ష నిర్వహించారు. 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్పై చర్చిస్తున్నారు. వీకెండ్ లాక్డౌన్పైనా అధికారులతో సీఎం కేసీఆర్ మంతనాలు జరుపుతున్నారు. ఇటీవల కాలంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియను ముమ్మరం చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 45 ఏళ్లు దాటిన వారికి రాష్ట్రంలో వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం జరుగుతోంది.