శభాష్.. సుధీర్.. సీఎం కేసీఆర్ కితాబు
ABN , First Publish Date - 2021-02-23T13:24:36+05:30 IST
సుధీర్రెడ్డి పనితీరును ముఖ్యమంత్రి కేసీఆర్ మెచ్చుకున్నారు. ..
హైదరాబాద్/ఎల్బీనగర్ : మూసీ సుందరీకరణ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి వాణీదేవి నామినేషన్ వేసే కార్యక్రమానికి వెళ్లే ముందు మంత్రులు, నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులను ప్రగతిభవన్కు పిలిపించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవల్పమెంట్ కార్పొరేషన్ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డిని పిలిచి మూసీ సుందరీకరణ పనుల పురోగతిపై సీఎం కితాబిచ్చారు. సుందరీకరణ పనులు చాలా బాగా జరుగుతున్నాయని సుధీర్రెడ్డి పనితీరును మెచ్చుకున్నారు. లండన్లోని థేమ్స్, ప్యారి్సలోని సియన్ నదులను చూడాలన్నారు. అవసరమైతే అక్కడికి కూడా వస్తానని కేసీఆర్ సుధీర్రెడ్డితో చెప్పారు. వాటిని పరిశీలించి, మూసీని సుందరీకరించాలని సూచించారు.