పీవీ సింధుకు కేసీఆర్ అభినందనలు
ABN , First Publish Date - 2021-08-02T00:58:58+05:30 IST
టోక్యో ఒలింపిక్స్ లో మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న పీవీ సింధును
హైదరాబాద్: టోక్యో ఒలింపిక్స్ లో మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న పీవీ సింధును ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అభినందించారు. వరసగా రెండు ఒలింపిక్స్ క్రీడల్లో పతకాలను సాధించిన మొదటి భారత మహిళా క్రీడాకారిణిగా పీవీ సింధు రికార్డు సాధించడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.