ప్రొఫెసర్‌ జయశంకర్‌కు సీఎం కేసీఆర్‌ నివాళి

ABN , First Publish Date - 2022-08-06T08:46:54+05:30 IST

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర స్వాప్నికుడు ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతి (శనివారం) సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఆయనకు నివాళులర్పించారు.

ప్రొఫెసర్‌ జయశంకర్‌కు సీఎం కేసీఆర్‌ నివాళి

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర స్వాప్నికుడు ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతి (శనివారం) సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఆయనకు నివాళులర్పించారు. ఉమ్మడి పాలనలో నాడు తెలంగాణకు జరిగిన నష్టాలు, కష్టాలను వివరిస్తూ.. తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షలను, ప్రజల్లో ఉద్యమ భావజాలాన్ని ప్రొ.జయశంకర్‌ రగిలించారని సీఎం స్మరించుకున్నా రు. జయశంకర్‌ స్ఫూర్తితో ఉద్యమాన్ని కొనసాగించి, మొక్కవోని దీక్షతో సాహసోపేత పోరాటం చేసి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. జయశంకర్‌ సార్‌ ఆశించినట్లుగానే స్వయంపాలనలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. 

Updated Date - 2022-08-06T08:46:54+05:30 IST