కార్పొరేషన్ లకు ఛైర్మన్ల నియామకం

ABN , First Publish Date - 2021-12-17T20:46:16+05:30 IST

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు పార్టీ సీనియర్లకు, అంకితభావంతో పనిచేసిన వారికి పదవులను కట్టబెడుతున్నారు.

కార్పొరేషన్ లకు ఛైర్మన్ల నియామకం

హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు పార్టీ సీనియర్లకు, అంకితభావంతో పనిచేసిన వారికి పదవులను కట్టబెడుతున్నారు. గత రెండు రోజుల క్రితం కొన్ని కార్పొరేషన్ లకు ఛైర్మన్లను నియమించగా తాజాగా శుక్రవారం కూడా మరికొందరికి పదవులు కట్టబెట్టారు. ఇందులో తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ గా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలితను నియమించారు. అలాగే తెలంగాణ బీవరేజీ కార్పొరేషన్ ఛైర్మన్ గా గజ్జెల నగేశ్ ను నియమించారు.


అలాగే తెలంగాణ స్టేట్ టెక్నాలజికల్ సర్వీసెస్ ఛైర్మన్ గా పాటి మీది జగన్ మోహన్ రావు నియమితులయ్యారు. తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ గా జూలూరి గౌరీశంకర్, తెలంగాణ షీప్ అండ్ గోట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ గా దూదిమెట్ల బాలరాజు యాదవ్ ను నియమించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి. 

Updated Date - 2021-12-17T20:46:16+05:30 IST