Nallagonda: ఎమ్మెల్యే కిషోర్ కుటుంబాన్ని పరామర్శించిన సీఎం కేసీఆర్

ABN , First Publish Date - 2021-12-29T19:34:05+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా పర్యటన కొనసాగుతోంది.

Nallagonda: ఎమ్మెల్యే కిషోర్ కుటుంబాన్ని పరామర్శించిన సీఎం కేసీఆర్

నల్గొండ: ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా పర్యటన కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితం జిల్లాకు చేరుకున్న సీఎం నల్గొండలోని పీటీఆర్ కాలనీలోని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ నివాసంలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కిషోర్ తండ్రి మారయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రులు జగదీష్ రెడ్డి, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ , ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు కూడా మారయ్యకు నివాళలర్పించారు. 

Updated Date - 2021-12-29T19:34:05+05:30 IST