జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్తో సీఎం కేసీఆర్ భేటీ
ABN , First Publish Date - 2022-03-04T21:28:44+05:30 IST
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు.
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. కుటుంబసమేతంగా జార్ఖండ్ వెళ్లిన కేసీఆర్కు సోరెన్ స్వాగతం పలికి ఆహ్వానించారు. అనంతరం ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీ అయ్యారు. గతంలో ఇచ్చిన హామీలో భాగంగానే కేసీఆర్ జార్ఖండ్ వెళ్లారు. చైనా సరిహద్దులోని గల్వాన్ వ్యాలీలో మృతిచెందిన సైనికులకు సీఎం కేసీఆర్ ఆర్థికసాయం అందించారు. అమర సైనికుడు కుందన్కుమార్ ఓజా భార్య నమ్రత కుమారికి రూ.10 లక్షలు.. అలాగే గణేష్ కుటుంబసభ్యులకు రూ.10 లక్షల చెక్ అందజేశారు. కేసీఆర్తో పాటు ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్, వినోద్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, సీఎస్ సోమేష్ కుమార్ తదితరులు ఉన్నారు. కాగా రాంచీలో కేసీఆర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.