TS News: స్వతంత్ర భారత వజ్రోత్సవాల కార్యాచరణపై సీఎం కేసీఆర్ సమావేశం

ABN , First Publish Date - 2022-08-02T16:17:41+05:30 IST

స్వతంత్ర భారత వజ్రోత్సవాల కార్యాచరణ, విధి విధానాలపై సీఎం కేసీఆర్ సమావేశం

TS News: స్వతంత్ర భారత వజ్రోత్సవాల కార్యాచరణపై సీఎం కేసీఆర్ సమావేశం

హైదరాబాద్ (Hyderabad): స్వతంత్ర భారత వజ్రోత్సవాల కార్యాచరణ, విధి విధానాలు సంబంధిత అంశాలపై సీఎం కేసీఆర్ (CM KCR) మంగళవారం 11గంటలకు ప్రగతి భవన్‌లో సమావేశం నిర్వహించనున్నారు. ఈ బేటీలో కమిటీ చైర్మన్ కేకే, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటు పలువురు మంత్రులు హాజరయ్యే అవకాశమున్నట్లు సమాచారం. అలాగే వర్షాలపై సీఎం రివ్యూ చేసే అవకాశమున్నట్లు తెలియవచ్చింది.


కాగా నూతన సచివాలయ (Secretariat) నిర్మాణ పనులను ఇవాళ మధ్యాహ్నం సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు. ఇప్పటికే కొత్త సెక్రేటేరియేట్‌ను ఏడు సార్లు సందర్శించారు. ఈ ఏడాది దసరా నాటికి కొత్త సచివాలయం ప్రారంభం చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అమరవీరల స్మారక చిహ్నం పనుల పురోగతినీ కేసీఆర్ తెలుసుకోనున్నారు.

Updated Date - 2022-08-02T16:17:41+05:30 IST