దక్షిణ తెలంగాణను ఎండబెట్టారు: జిట్టా

ABN , First Publish Date - 2020-05-31T09:00:25+05:30 IST

తెలంగాణ ఉద్యమాలను సీఎం కేసీఆర్‌ పక్కనబెట్టారని, దక్షిణ తెలంగాణను ఎండబెట్టారని యువ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి ఆరోపించారు.

దక్షిణ తెలంగాణను ఎండబెట్టారు: జిట్టా

హైదరాబాద్‌, మే 30(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉద్యమాలను సీఎం కేసీఆర్‌ పక్కనబెట్టారని, దక్షిణ తెలంగాణను ఎండబెట్టారని యువ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రా కాంట్రాక్టర్లను ఆయన నెత్తిన పెట్టుకుని, స్వార్థపూరిత పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం సీఎం కేసీఆర్‌కు జ్ఞానోదయం కలగాలని జూన్‌ 2న అమరవీరుల స్థూపాల వద్ద వినతి పత్రాలు ఇవ్వాలని విద్యార్థులు, ఉద్యమకారులు, అన్నివర్గాల ప్రజలకు పిలుపునిచ్చారు.  

Updated Date - 2020-05-31T09:00:25+05:30 IST