జనగామ జిల్లాలో పర్యటించున్న కేసీఆర్

ABN , First Publish Date - 2020-10-31T03:37:09+05:30 IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జనగామ జిల్లాలో పర్యటించనున్నారు.

జనగామ జిల్లాలో పర్యటించున్న కేసీఆర్

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. శనివారం నాడు హైదరాబాద్ నుంచి కొడకండ్ల మండలానికి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా కొడకండ్ల కేంద్రంలోని రైతు వేదికని కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, నిరంజన్ రెడ్డిలు దగ్గరుండి చూసుకున్నారు.


పర్యటన ఇలా..

రేపు అనగా శనివారం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కొడకండ్లకు వెళ్లనున్నారు. 12:10 నివిుషాలకు గులాబీ బాస్.. రైతు వేదిక భవనాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం పల్లెప్రకృతివనాని పరిశీలించనున్నారు. ఆ తర్వాత వైకుంఠదామం డంపింగ్ యాడ్ పనులను పరిశీలించి.. 5000 మ౦ది రైతులతొ కలిసి సమావేశంలో మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా రైతు వేదికల ఉద్దేశం, వాటి ఆవశ్యకతను రైతులకు సీఎం వివరించనున్నారు. ఈ పర్యటన అనంతరం శనివారం సాయంత్రం కొడకండ్ల నుంచి కేసీఆర్ తిరుగుపయనం కానున్నారు.

Updated Date - 2020-10-31T03:37:09+05:30 IST