పేదింటి పెద్దన్న సీఎం కేసీఆర్
ABN , First Publish Date - 2022-08-16T09:29:54+05:30 IST
రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించడం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్..
45 లక్షల మందికి పెన్షన్లు తెలంగాణ ఘనత: కవిత
హైదరాబాద్, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించడం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్.. పేదింటి పెద్దన్నగా నిలుస్తున్నారన్న విషయం మరోసారి రుజువైందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కేసీఆర్ నిర్ణయం లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపుతుందని పేర్కొన్నారు. కేసీఆర్ తాజా నిర్ణయంతో రాష్ట్రంలో పెన్షన్లు పొందుతున్న లబ్ధిదారుల సంఖ్య 45 లక్షల మందికి పైగా చేరిందని, ఇంత పెద్ద సంఖ్యలో పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని ఆమె సోమవారం ట్విటర్లో పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 4 లక్షల మంది మహిళా బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం కూడా తెలంగాణయేనని వివరించారు.