సీఎం కేసీఆర్ తెలంగాణను ఆర్థికంగా నాశనం చేశారు: ఉత్తమ్
ABN , First Publish Date - 2022-07-25T23:31:03+05:30 IST
Hyderabad: ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్ తెలంగాణను ఆర్థికంగా నాశనం చేశారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర అప్పు రూ.69 వేల కోట్లు ఉండగా.. 2022 మార్చి 31
Hyderabad: ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి (MP Uttam Kumar Reddy) సీఎం కేసీఆర్ (CM KCR) ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్ తెలంగాణను ఆర్థికంగా నాశనం చేశారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర అప్పు రూ.69 వేల కోట్లు ఉండగా.. 2022 మార్చి 31 నాటికి రూ.3,12 లక్షల కోట్లకు చేరిందని పేర్కొన్నారు. అవసరం లేని ప్రాజెక్ట్లు కట్టి ప్రజాధనం వృధా చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉండడం బాధాకరమన్నారు. టీఆర్ఎస్ అవినీతి, అసమర్థత వల్లే రాష్ట్రం దివాళా తీసే స్థితికి చేరుకుందని విమర్శించారు.