ప్రతి చుక్క నీటిని కేసీఆర్ సాధిస్తారు: గుత్తా సుఖేందర్ రెడ్డి

ABN , First Publish Date - 2020-08-02T22:31:49+05:30 IST

ప్రతి చుక్క నీటిని కేసీఆర్ సాధిస్తారు: గుత్తా సుఖేందర్ రెడ్డి

ప్రతి చుక్క నీటిని కేసీఆర్ సాధిస్తారు: గుత్తా సుఖేందర్ రెడ్డి

చిట్యాల, నల్గొండ: నదీ జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన ప్రతి చుక్క నీటిని ముఖ్యమంత్రి కేసీఆర్ సాధిస్తారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కృష్ణానదిపై ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులపై కృష్ణా రివర్ బోర్డ్ కు సీఎం కేసీఆర్ ఫిర్యాదు చేశారని సుఖేందర్ రెడ్డి తెలిపారు. కృష్ణా రివర్ బోర్డ్ కూడా ఏపీ ప్రభుత్వ ఏకపక్ష ధోరణిని తప్పు పట్టిందని, నిలుపుదల చేయాలని ఆదేశించిందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు కేసీఆర్ పై ఆరోపణలు చేసే నైతిక హక్కు, అర్హత లేదని గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తరలించుకుపోతుంటే కనీసం నోరు కూడా మెదపలేదని గుత్తా ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ రైతుల ప్రయోజనాలకు భంగం కలగనివ్వరని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.


Updated Date - 2020-08-02T22:31:49+05:30 IST