కిషన్రెడ్డి చేతకాని దద్దమ్మ: కేసీఆర్
ABN , First Publish Date - 2021-11-30T01:08:21+05:30 IST
కేంద్రమంత్రి కిషన్రెడ్డికి దమ్ముంటే కేంద్రంతో బాయిల్డ్ రైస్ కొనించాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. కేబినెట్ భేటీ తర్వాత సీఎం కేసీఆర్ మీడియాతో..
హైదరాబాద్: కేంద్రమంత్రి కిషన్రెడ్డికి దమ్ముంటే కేంద్రంతో బాయిల్డ్ రైస్ కొనించాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. కేబినెట్ భేటీ తర్వాత సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రప్రభుత్వం తీరును ఆయన తప్పుబట్టారు. వరి విషయంలో కిషన్ రెడ్డి చేతకాని దద్దమ్మలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 750 మంది రైతుల్ని పొట్టనబెట్టుకున్న హంతక పార్టీ బీజేపీ అని వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు రైతులను అయోమయానికి గురిచేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులను 100శాతం ముంచుతుందని కేసీఆర్ ఆరోపించారు.
‘‘బాయిల్డ్ రైస్ కొనమని కేంద్రం స్పష్టంగా చెప్పింది. రా రైస్ ఎంత తీసుకుంటారో కూడా కేంద్రం చెప్పలేదు. 90లక్షల టన్నుల ధాన్యం తీసుకోవాలని కేంద్రాన్ని కోరాం. యాసంగిలో వడ్లు పండితే నూక ఎక్కువగా వస్తుంది. నష్టపోకుండా ఉండేందుకే మిల్లర్లు బాయిల్డ్ రైస్ చేస్తున్నారు. మెడపై కత్తిపెట్టి కేంద్రం బలవంతంగా అగ్రిమెంట్ రాయించుకుంది. ఢిల్లీకి వెళ్తే మొహంలేక మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇంత దిగజారిన కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు. విభజన చట్టం ప్రకారం కేంద్రం సహకారం అందివ్వడంలేదు. ఏపీ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసినా.. ప్రాజెక్టులు నిర్మించాం.’’ అని కేసీఆర్ తెలిపారు.