ప్రశ్నిస్తే దేశ ద్రోహులా?: సీఎం కేసీఆర్‌

ABN , First Publish Date - 2021-11-08T23:38:33+05:30 IST

ప్రశ్నిస్తే దేశ ద్రోహులా?: సీఎం కేసీఆర్‌

ప్రశ్నిస్తే దేశ ద్రోహులా?: సీఎం కేసీఆర్‌

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రైతుల పక్షాన ప్రశ్నిస్తే దేశ ద్రోహులమా అని కేంద్రాన్ని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిచ్చినప్పుడు తాము దేశద్రోహులం కాదా అని ఆయన నిలదీసారు. సమస్యలపై గట్టిగా మాట్లాడితే అర్బన్‌ నక్సలైట్లు అంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేసారు. దేశం దురాక్రమణకు గురికాకుండా చూడాలని చెబితే దేశద్రోహులని ముద్ర వేస్తారా అని ఆయన మండిపడ్డారు. తాను చైనాలో డబ్బు దాస్తున్నానని బీజేపీ నాయకులు చెబుతున్నారన్నారు. బీజేపీ.. అబద్ధాల మీద బతికే పార్టీ అని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రైతు వ్యతిరేక చట్టాలను ఎప్పుడు విత్‌డ్రా చేసుకుంటారని ఆయన ప్రశ్నించారు. 



Updated Date - 2021-11-08T23:38:33+05:30 IST