వచ్చే ఎన్నికల్లో KCR ఓడిపోవడం ఖాయం: ఈటల
ABN , First Publish Date - 2022-06-12T21:12:33+05:30 IST
వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ (CM KCR) ఓడిపోవడం ఖాయమని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ జోస్యం చెప్పారు.
మహబూబ్నగర్: వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ (CM KCR) ఓడిపోవడం ఖాయమని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ జోస్యం చెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సంపదకు ప్రజలు యజమానులని, సీఎం కేసీఆర్ కాదన్నారు. హుజురాబాద్ ఎన్నికల్లో రూ.600 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చి ఖర్చు చేశారు? అని ఈటల రాజేందర్ (Etala Rajender) ప్రశ్నించారు. రాష్ట్రంలోని రైతులు, ప్రమాదంలో చనిపోయినవారిపై లేని ప్రేమ.. పంజాబ్ రైతులపై ఎందుకు? అని ప్రశ్నించారు. సీఎస్, కలెక్టర్లు మద్యంను ప్రమోషన్ చేసే పనిలో ఉన్నారని తప్పుబట్టారు. కేసీఆర్కు పోయేకాలం వచ్చినందుకే ఎన్నికల వ్యూహకర్త పీకే అవసరం వచ్చిందని ఈటల రాజేందర్ అన్నారు.