కేసీఆర్ కాదు.. దుబాయ్ శేఖర్: డీకే అరుణ
ABN , First Publish Date - 2021-11-09T02:15:34+05:30 IST
కేసీఆర్ కాదని, దుబాయ్ శేఖర్ అని బీజేపీ నాయకురాలు డీకే అరుణ ఎద్దేవా చేశారు. ధర్నాలు చేసే హక్కు టీఆర్ఎస్ పార్టీకి లేదని ..
హైదరాబాద్: కేసీఆర్ కాదని, దుబాయ్ శేఖర్ అని బీజేపీ నాయకురాలు డీకే అరుణ ఎద్దేవా చేశారు. ధర్నాలు చేసే హక్కు టీఆర్ఎస్ పార్టీకి లేదని ఆమె వ్యాఖ్యానించారు. ధాన్యం కొనుగోలుపై సీఎం కేసీఆర్ కేంద్రంతో చర్చించాలన్నారు. కేసీఆర్ ఫాంహౌస్ విస్తీర్ణం ఎన్ని ఎకరాల్లో ఉందని, జన్వాడ ఫాంహౌస్ సంగతేంటని డీకే అరుణ ప్రశ్నించారు. కేసీఆర్ కూతురు దుబాయ్లో రూ. 60 కోట్లతో ఫ్లాట్ కొన్నమాట వాస్తవం కాదా? అని నిలదీశారు. దళితబంధు అమలు చేసేవరకు కేసీఅర్ను వదిలిపెట్టమని హెచ్చరించారు. రైతులపై కేసీఆర్ దొంగ ప్రేమను ఒలకబోస్తున్నాడని, ప్రతిపక్షాలను బూతులు తిడుతోన్న కేసీఆర్ను ఏ జైల్లో పెట్టాల్లో కేటీఆర్ చెప్పాలని డీకే అరుణ డిమాండ్ చేశారు.
‘‘ కేసీఆర్ భారతీయోడో.. కాదో స్పష్టం చేయాలి. దేశ ద్రోహిగానే తెలంగాణ సీఎం కేసీఆర్ను పరిగణిస్తాం. ప్రధాని మోదీ పేరు ఉచ్చరించే హక్కు.. అవినీతి సామ్రాట్ కేసీఆర్కు లేదు. కేసీఆర్ తెలంగాణ దొంగ గాంధీ. హుజురాబాద్ సెగతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉద్యమ సమయంలో హైదరాబాద్లో ఉన్న ఆంధ్రులను కేసీఆర్ దోచుకున్నారు. 1200మంది పిల్లల్ని చంపి కేసీఆర్ ముఖ్యమంత్రి పదవిని అనుభవిస్తున్నారు. ఉప ఎన్నిక ఓటమిని కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నికల్లో డబ్బులు పని చేయవని కేసీఆర్కు జ్ఞానోదయం అయింది. మద్యం దుకాణాలకు తగ్గించేవరకు కేసీఆర్ను వదిలిపెట్టం. కేసీఆర్ .. పాలమూరు జిల్లా ద్రోహి.’’ అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు.