సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం

ABN , First Publish Date - 2021-06-24T05:34:10+05:30 IST

జిల్లాలోని గ్రామపంచాయతీలు, ముని సిపాలిటీలకు నిధులు మంజూరు చేయడాన్ని హర్షిస్తూ గుట్టలో సర్పంచ్‌ల ఫో రం మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య ఆధ్వర్యంలో నాయకులు సీఎం కేసీఆర్‌, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత చిత్రపటానికి మంగళవారం క్షీరాభిషేకం చేశారు.

సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం
గుట్టలో కేసీఆర్‌, సునీత ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేస్తున్న ప్రజాప్రతినిధులు

యాదాద్రి రూరల్‌/ వలిగొండ / ఆలేరు / రాజాపేట / తుర్కపల్లి(బొమ్మలరామారం) /  తుర్కపల్లి / ఆత్మకూరు(ఎం), జూన్‌ 23 : జిల్లాలోని గ్రామపంచాయతీలు, ముని సిపాలిటీలకు నిధులు మంజూరు చేయడాన్ని హర్షిస్తూ గుట్టలో సర్పంచ్‌ల ఫో రం మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య ఆధ్వర్యంలో నాయకులు సీఎం కేసీఆర్‌, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత చిత్రపటానికి మంగళవారం క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ నిధులు మంజూరు చేస్తున్న సీఎం కేసీఆర్‌, అందుకు సహకరించిన ప్రభుత్వ విప్‌ సునీతకు తమ ఫోరం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆలేరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గడ్డమీది రవీందర్‌గౌడ్‌, మునిసిపల్‌ చైర్మన్‌ ఎరుకల సుధాహేమేందర్‌గౌడ్‌, జడ్పీటీసీ తోటకూరి అనురాధ, సర్పంచ్‌లు ఒం టేరు సువర్ణ, సిరికొండ సత్యనారాయణ, శ్రీశైలం, గుండ్ల సరిత, తోటకూరి బీరయ్య, మిట్ట వెంకటయ్యగౌడ్‌, హేమేందర్‌గౌడ్‌, నర్సింహ, బాలరాజ్‌, శ్రీధర్‌గౌడ్‌, చంద్రయ్య, అనిల్‌గౌడ్‌ పాల్గొన్నారు. వలిగొండ మండలకేంద్రంలో మండల కేంద్రంలో సీఎం కేసీఆర్‌, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశా రు. కార్యక్రమంలో సర్పంచల ఫోరం అధ్యక్షుడు ఏనుగు అంజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి బొడ్డుపల్లి ఉమ, మండల అధ్యక్షుడు గేడల పాండరి, నాయకులు రత్నయ్య, రాంరెడ్డి, అన్నమేరి, మంజూల, నర్సింహ, శంకర్‌ పాల్గొన్నారు. ఆలేరులో మునిసిపల్‌ చైర్మన వస్పరి శంకరయ్య, పలువురు కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు సీఎం కేసీఆర్‌ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌, మంత్రి జగదీ్‌షరెడ్డి, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, టెస్కాబ్‌ వైస్‌ చైర్మన గొంగిడి మహేందర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో చైర్మన శంకరయ్య, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు మొరిగాడి వెంకటేష్‌, కౌన్సిలర్లు బేతి రాములు, రాయపురం నర్సింహులు, శ్రీకాంత, మాజీ సర్పంచ దాసి సంతోష్‌, పలువురు నాయకులు పాల్గొన్నారు. రాజాపేట మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి సర్పంచలు, నాయకులు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో సర్పంచలు, నాయకులు రాజి రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రాజు, భాస్కర్‌, నరేష్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, తదిత రులు పాల్గొన్నారు. బొమ్మలరామారం, తుర్కపల్లి, ఆత్మకూర్‌(ఎం) మండలాల్లో ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నాయకులు సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.

Updated Date - 2021-06-24T05:34:10+05:30 IST