కాసేపట్లో ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న సీఎం కేసీఆర్

ABN , First Publish Date - 2022-03-04T15:53:44+05:30 IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరికాసేపట్లో ఢిల్లీలోని నివాసం నుంచి ఎయిర్‌పోర్టు చేరుకోనున్నారు.

కాసేపట్లో ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న సీఎం కేసీఆర్

న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరికాసేపట్లో ఢిల్లీలోని నివాసం నుంచి ఎయిర్‌పోర్టు చేరుకోనున్నారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా జార్ఖండ్‌కు వెళ్లనున్నారు. చైనా సరిహద్దులోని గల్వాన వాలీలో జరిగిన హింసాత్మక ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన భారత అమర జవాన్లకు గతంలో కేసీఆర్ రూ.10 లక్షలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్‌తో కలిసి ఇద్దరు అమర జవాన్ల కుటుంబాలకు రూ.10 లక్షల చెక్కులను సీఎం కేసీఆర్ అందజేయనున్నారు. 

Updated Date - 2022-03-04T15:53:44+05:30 IST