భరత్ భూషణ్ మరణం పట్ల కేసీఆర్ సంతాపం
ABN , First Publish Date - 2022-01-31T20:35:04+05:30 IST
ప్రముఖ ఫోటోగ్రాఫర్ గుడిమల్ల భరత్ భూషణ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సంతాపం ప్రకటించారు.
హైదరాబాద్: ప్రముఖ ఫోటోగ్రాఫర్ గుడిమల్ల భరత్ భూషణ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సంతాపం ప్రకటించారు. తెలంగాణ ప్రజల జీవన శైలిని, సంస్క`తిని, చారిత్రక ఘట్టాలను తన ఆర్ట్ ద్వరా,ఛాయా చిత్రాల ద్వరా ప్రపంచానికి చాటిన భరత్ భూషణ్ దశాబ్ధాల శ్రమ గొప్పదని సీఎం అన్నారు. భరత్ భూషణ్ మరణంతో తెలంగాణ ఒక అరుదైన చిత్రకారుడు, ఫోటో జర్నలిస్ట్ ను కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.