సిరివెన్నెల మృతికి కేసీఆర్ సంతాపం

ABN , First Publish Date - 2021-12-01T00:04:30+05:30 IST

ప్రముఖ తెలుగు సినీగేయ రచయిత, పద్మ చంబోలు (సిరివెన్నెల) సీతారామ శాస్ర్తి మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సంతాపం వ్యక్తం చేశారు.

సిరివెన్నెల మృతికి కేసీఆర్ సంతాపం

హైదరాబాద్: ప్రముఖ తెలుగు సినీగేయ రచయిత, పద్మ చంబోలు (సిరివెన్నెల) సీతారామ శాస్ర్తి మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సంతాపం వ్యక్తం చేశారు.ఎటువంటి సంగీత ప్రియులతోనైనా పెనవేసుకు పోయే అద్భుత సాహిత్యాన్ని అందించిన సిరివెన్నెల, పండిత పామరుల మనసులను గెలిచారని సీఎం తెలిపారు.


సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్న ఆయన సాహిత్య ప్రస్ధానం, సామాజిక, సాంప్రదాయ అంశాలను స్పశిస్తూ మూడున్నర దశాబ్ధాల పాటు సాగిందని గుర్తు చేసుకున్నారు. సిరివెన్నెల సీతారామశాస్ర్ర్తి మరణం, తెలుగు చలన చిత్ర రంగానికి, సంగీత సాహిత్య అభిమానులకు తీరని లోటన్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 

Updated Date - 2021-12-01T00:04:30+05:30 IST