సినారెకు ఘనంగా నివాళులర్పించిన కేసీఆర్‌

ABN , First Publish Date - 2021-06-12T23:18:03+05:30 IST

తెలంగాణ సాహితీ సౌరభాలను విశ్వంభరావ్యాపితం చేసి, తెలుగు కవితను మహోన్నత స్థాయిలో నిలిపిన జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత, ఆచార్య డా. సినారె (సింగిరెడ్డి నారాయణరెడ్డి) వర్దంతి సందర్బంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆయనకు ఘనంగా

సినారెకు ఘనంగా నివాళులర్పించిన కేసీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ సాహితీ సౌరభాలను విశ్వంభరావ్యాపితం చేసి, తెలుగు కవితను మహోన్నత స్థాయిలో నిలిపిన జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత, ఆచార్య డా. సినారె (సింగిరెడ్డి నారాయణరెడ్డి) వర్దంతి సందర్బంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. కవిగా, రచయితగా,గేయ కావ్య కృతి కర్తగా, పరిశోధకుడిగా, విద్యావేత్తగా, సినీ గీతాల రచయితగా,తనదైన శైలిలో తెలంగాణ పద సోయగాలను ఒలికిస్తూ సాహితీ ప్రస్ధానాన్నికొనసాగించిన సృజన కారుడు సినారె అని సీఎం అన్నారు. ప్రకృతి మానవ తాత్వికతను ఆవాహనం చేసుకున్న ద్రష్ట, తెలంగాణ జాతికి జ్ఞానపీఠ అవార్డును అందించిన సాహితీ స్రష్ట, సినారె అని కేసీఆర్‌ కొనియాడారు. 


దక్కనీ ఉర్దూ తెలుగు భాషా సాహిత్యాలను జుగల్బందీలను చేసి, గజల్స్‌తో అలాయ్‌ బలాయ్‌ తీసుకుని, తెలంగాణ గడ్డమీద గంగా జమున తెహజీబ్‌కు సినారె సాహితీ చిరునామాగా నిలిచారని సీఎం గుర్తుచేసుకున్నారు. దేశీయ, అంతర్జాతీయ భాషల్లో, తెలుగు సాహితీ లోకంలో, తెలంగాణకు ఒక ప్రత్యేక స్థానాన్ని చేకూర్చిన సినారె కృషి అజరామరం అని సీఎం అన్నారు. భాషా సాహిత్యాలు నిలిచి ఉన్నన్నాళ్లూ ప్రజల హృదయాల్లో సినారె చిరకాలం నిలిచి ఉంటారని సీఎం కేసీఆర్‌ స్మరించుకున్నారు. 


Updated Date - 2021-06-12T23:18:03+05:30 IST